Encounter : ఛత్తీస్గఢ్ (Chattishgarh) లోని బీజాపూర్ జిల్లా (Bijapur district) లో నక్సలైట్లు (Maoists), భద్రతాబలగాల (Security forces) కు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు.
ఇంద్రావతి నదీ తీరంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు దాగి ఉన్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపులు చేపడుతుండగా తారసపడిన మావోయిస్టులు కాల్పులు జరుపడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. తమ ప్రతిదాడిలో వారు మృతిచెందారని తెలిపారు.