హైదరాబాద్ : ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిని నిర్ధారించినే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో హిడ్మా ఉన్నట్లు సమాచారం. హిడ్మా ఉన్నాడనే సమాచారంతోనే సీఆర్పీఎఫ్ దళాలు కూంబింగ్ చేపట్టాయి. కూంబింగ్ సమయంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.