లక్నో: ఉత్తరప్రదేశ్ ఎంపీ, గ్యాంగ్స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు, అసద్ అహ్మద్ను పోలీసులు ఎన్కౌంటర్లో చంపడాన్ని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) ఖండించారు. రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వానికి న్యాయవ్యవస్థపై నమ్మకం లేదని అందుకే బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నదని ఆరోపించారు. వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆయన విమర్శించారు. ఈ మేరకు గురువారం ఒక ట్వీట్ చేశారు. ‘తప్పుడు ఎన్కౌంటర్లు చేస్తూ, అసలు సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. బీజేపీకి కోర్టుపై అస్సలు నమ్మకం లేదు. ఇవాళ జరిగిన ఎన్కౌంటర్తోపాటు ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లపై సమగ్ర దర్యాప్తు జరుపాలి. దోషులను వదలకూడదు. ఏది ఒప్పో, ఏది తప్పో నిర్ణయించే హక్కు అధికారానికి లేదు. సోదరభావానికి బీజేపీ వ్యతిరేకం’ అని హిందీ ట్వీట్లో పేర్కొన్నారు.
కాగా, ప్రయాగ్రాజ్లో జరిగిన ఉమేష్ పాల్ హత్య కేసులో అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ వాంటెడ్గా ఉన్నాడు. గురువారం ఝాన్సీలో జరిగిన ఎన్కౌంటర్లో అతడు హతమయ్యాడు. రూ.5 లక్షల రివార్డు ఉన్న గులాం అనే మరో వ్యక్తి కూడా ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఎన్కౌంటర్లో మరణించినట్లు యూపీ పోలీస్ చీఫ్ వెల్లడించారు.
झूठे एनकाउंटर करके भाजपा सरकार सच्चे मुद्दों से ध्यान भटकाना चाह रही है। भाजपाई न्यायालय में विश्वास ही नहीं करते हैं। आजके व हालिया एनकाउंटरों की भी गहन जाँच-पड़ताल हो व दोषियों को छोड़ा न जाए। सही-गलत के फ़ैसलों का अधिकार सत्ता का नहीं होता है।
भाजपा भाईचारे के ख़िलाफ़ है।
— Akhilesh Yadav (@yadavakhilesh) April 13, 2023
Also Read: