పట్నా : బిహార్ అసెంబ్లీ ప్రాంగణంలో ఖాళీ మద్యం సీసాలను గుర్తించడం కలకలం రేపింది. బిహార్లో మద్యం సేవించడం, విక్రయించడంపై నిషేధం అమల్లో ఉండటంతో అసెంబ్లీలోని పార్కింగ్ లాట్లో ఖాళీ మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారనే వార్తలపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ సీఎం నితీష్ కుమార్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.
నితీష్ సర్కార్లో మంత్రులకు నేరాలు చేసే హక్కు ఉందని, సీఎం నితీష్ కుమార్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బిహార్ అసెంబ్లీలోకి మద్యం సీసాలు ఎలా వచ్చాయని తేజస్వి నిలదీశారు. లిక్కర్ మాఫియాతో సీఎం నితీష్ కుమార్ కలిసున్న ఫోటోలు బయటకు వచ్చాయని..బిహార్ ప్రజలకు నితీష్ క్షమాపణ చెప్పాలని తేజస్వి యాదవ్ డిమాండ్ చేశారు.