న్యూఢిల్లీ: ఇప్పటి వరకు ఈ-కామర్స్ వేదికలపై, వాహనాల కొనుగోళ్లు తదితర సందర్భాల్లో లభించే ఈఎంఐ సదుపాయం ఐఆర్సీటీసీలోనూ అందుబాటులోకి వచ్చింది. ఇకపై మనం బుకింగ్ చేసుకొనే రైలు టికెట్టు ధరను ఈఎంఐలలో చెల్లించవచ్చు. ఇందుకోసం ‘ఇప్పుడు ప్రయాణించండి, తర్వాత చెల్లించండి(ట్రావెల్ నౌ పే లేటర్) సేవలను రైల్వే ప్రయాణికుల కోసం ‘క్యాష్ఈ’ సంస్థతో కలిసి ఐఆర్సీటీసీ తాజాగా ప్రారంభించింది. ఐఆర్సీటీసీకి చెందిన ట్రావెల్ యాప్ ‘ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్’లో ఈ సేవలు లభ్యమవుతాయి. వినియోగదారులందరూ ఈఎంఐ సదుపాయాన్ని ఆటోమేటిక్గా పొందవచ్చని, ఎలాంటి డాక్యుమెంటేషన్ అవసరం లేదని క్యాష్ఈ పేర్కొన్నది.