న్యూఢిల్లీ: దేశంలో ఎక్స్ యూజర్లకు ఎలాన్ మస్క్ (Elon Musk) షాకిచ్చారు. భారత్లోని 2 లక్షల మందికిపైగా ఖాతాదారుల అకౌంట్లను ‘ఎక్స్ కార్ప్’ (X Corp) బ్లాక్ చేసింది. పిల్లలపై లైంగిక దాడులు, అశ్లీలత, ఉద్రిక్తతలను ప్రోత్సహించే కంటెంట్ కట్టడిలో భాగంగా మార్చి నెలలో ఏకంగా 2,12,627 ఖాతాలపై నిషేధం విధించినట్లు ప్రకటించింది. ఫ్రిబవరి 26 నుంచి మార్చి 25 వరకు భారతీయ సైబర్స్పేస్లో ఉగ్రవాదాన్ని ప్రచారం చేసినందుకుగాను 1,235 ఖాతాలను తొలగించినట్లు తెలిపింది. కొత్త ఐటీ నిబంధనల మేరకు చర్యలు తీసుకున్నట్లు తన నెలవారీ నివేదికలో పేర్కొంది.
మొత్తంగా ఈ రిపోర్టింగ్ సైకిల్లో దేశవ్యాప్తంగా 2,13,862 ఖాతాలపై నిషేధం విధించినట్లు తెలిపింది. భారతీయ వినియోగదారుల నుంచి 5,158 ఫిర్యాదులు అందాయని, తమ గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం ద్వారా వాటిని పరిష్కరించామని వెల్లడించింది. వాటిలో ఎక్కువగా నిషేధాన్ని తప్పించుకోవడం (3,074), అడల్ట్ కంటెంట్ (953), విద్వేశాన్ని రెచ్చగొట్టడం (412), వేధింపులకు (359) సంబంధించినవి ఉన్నాయని తెలిపింది. కాగా, జనవరి 26 నుంచి ఫిబ్రవరి 25 వరకు ముగిసిన నెలలో 5,06,173 మంది ఖాతాలను ఎక్స్ నిషేధించిన విషయం తెలిసిందే.