న్యూయార్క్: ఎలన్ మస్క్ దాతృత్వాన్ని ప్రదర్శించారు. టెస్లా ఎలక్ట్రిక్ కార్ల సంస్థకు చెందిన సుమారు 1.95 బిలియన్ల డాలర్ల విలువైన షేర్లను ఛారిటీకి డోనేట్ చేశారు. యూఎస్ రెగ్యులేటర్ల వద్ద దాఖలు చేసిన ఫైలింగ్లో మస్క్ ఈ విషయాన్ని చెప్పారు. సుమారు 11.6 మిలియన్ల షేర్లను దానం చేసినట్లు ఆయన తెలిపారు. అయితే ఎవరికి ఆ డొనేషన్ అందిందో తమ ఫైలింగ్లో మస్క్ వెల్లడించలేదు.
గత ఏడాది ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు ఆ షేర్లను మస్క్ డొనేట్ చేసినట్లు యూఎస్ సెక్యూర్టీస్ అండ్ ఎక్స్చేంజ్ కమీషన్ కు దాఖలు చేసిన ఫైలింగ్లో ఉంది. అయితే ఈ అంశంపై టెస్లా ఇంత వరకు అధికారికంగా స్పందించలేదు.
2021లో కూడా టెస్లా కంపెనీ సుమారు 5.7 బిలియన్ల డాలర్ల విలువైన షేర్లను ఛారిటీ సంస్థకు డొనేట్ చేసింది. ఈ ఏడాది చివరి నాటికి ట్విట్టర్ సంస్థకు సీఈవోను నియమించనున్నట్లు మస్క్ తెలిపారు.