న్యూఢిల్లీ, డిసెంబర్ 14: ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కృత్రిమ మేధ స్టార్టప్ ఎక్స్ఏఐ తన ఏఐ చాట్బాట్ గ్రోక్ సేవలను ఇండియాతో పాటు 46 దేశాల్లో అందుబాటులోకి తెచ్చింది. ఈ చాట్బాట్ ఎక్స్ ప్రీమియం+ చందాదారులకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఎక్స్ ప్రీమి యం+ వాడకందారులు వెబ్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ సైడ్ మెనులో గ్రోక్ను గుర్తించవచ్చు.
ఎలాన్ మస్క్ అమెరికాలోని ఆస్టిన్లో యూనివర్సిటీ స్థాపించే ఆలోచనలో ఉన్నట్టు బ్లూమ్బర్గ్ తెలిపింది. సుమారు 100 మిలియన్ డాలర్లను మస్క్ ఈ యూనివర్సిటీకి విరాళంగా ఇవ్వనున్నారు. మొదట స్టెమ్ కోర్సులకు ప్రాధాన్యమిస్తూ ప్రాథమిక, సెకండరీ పాఠశాలలను ప్రారంభించాలని యోచిస్తున్నట్టు సమాచారం.