హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): ఉత్తరప్రదేశ్లో విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్లు సమ్మెకు దిగారు. ఉత్తరప్రదేశ్ విద్యుత్తు కర్మచారి సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం రాత్రి 10 గంటల నుంచి 72 గంటల నిరవధిక సమ్మెకు పూనుకున్నారు. ఉత్తరప్రదేశ్లో విద్యుత్తు రంగ ప్రైవేటీకరణ యత్నాన్ని ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ సమ్మెకు టీఎస్పీఈఏ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు హైదరాబాద్ విద్యుత్తు భవన్లో గురువారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం ప్రకటించారు. ఈ సందర్భంగా సంఘం ప్రధాన కార్యదర్శి పీ సదానందం మాట్లాడుతూ కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు విద్యుత్తు రంగాన్ని ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నాయని, ఇదే జరిగితే ఇతర సంఘాలను కలుపుకొని దేశవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్లో విద్యుత్తురంగ ప్రైవేటీకరణ యత్నాన్ని తక్షణమే ఉపసంహరించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఎస్పీఈఏ నేతలు వెంకట్నారాయణరెడ్డి, కిరణ్కుమార్, జనప్రియ, కిషోర్కుమార్, శ్యాంసుందర్రెడ్డి, గోపాలకృష్ణ, పవన్కుమార్, శ్యాంప్రసాద్, తిరుపతి, భాసర్, పాషా, వెంకటేశ్, విద్యాసాగర్, లక్ష్మీప్రసాద్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.