న్యూఢిల్లీ, మే 22: విద్యుత్తు వాహనాల్లో (ఈవీ) మంటలు చెలరేగడానికి బ్యాటరీ లోపాలే ప్రధాన కారణమని డీఆర్డీవో నివేదికలో వెల్లడించింది. బ్యాటరీ ప్యాక్, మాడ్యూల్లను అన్ని ఉష్ణోగ్రతల వద్ద సరిగ్గా తనిఖీ చేయకపోవడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఉత్పత్తి వ్యయం తగ్గించుకోవడానికి కంపెనీలు బ్యాటరీల తయారీలో తక్కువ నాణ్యత గత మెటీరియల్ను వినియోగిస్తున్నట్టు ఆరోపించాయి. కాగా, ప్రస్తుతం 2 శాతంగా ఉన్న టూ-వీలర్ ఈవీల వినియోగాన్ని 80 శాతానికి పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకొన్నది.