ముంబై, మార్చి15: రాజకీయ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ఎలక్టోరల్ బాండ్ విధానాన్ని ప్రవేశపెట్టారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారని.. కానీ నేడు వాటి వెనుక ఉన్న అసలు కోణాన్ని దేశం అర్థం చేసుకుందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.
ఎలక్టోరల్ బాండ్ ప్రపంచంలోనే అతిపెద్ద వాయిదాల రికవరీ రాకెట్ అని, రికవరీ కోసం సీబీఐ, ఈడీ, ఐటీని బీజేపీ ఉపయోగిస్తుందని విమర్శించారు. భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద అవినీతిలో ప్రధాని మోదీ హస్తం ఉందని ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు.