న్యూఢిల్లీ: 57 రాజ్యసభ స్థానాలకు జూన్ 10వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజున సాయంత్రం ఫలితాలను వెల్లడించనున్నారు. ఈనెల 24వ తేదీన రాజ్యసభ ఎన్నికల కోసం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. నామినేషన్కు చివరి గడువు మే 31వ తేదీ. మొత్తం 15 రాష్ట్రాల్లో ఉన్న 57 ఖాళీలకు ఈ ఎన్నికలు జరుగుతాయి. యూపీలో 11, ఏపీలో 4, రాజస్థాన్ లో 4, చత్తీస్ఘడ్ లో 4, జార్ఖండ్ లో 2, మహారాష్ట్రలో 6, తమిళనాడులో 6, పంజాబ్ లో 2, ఉత్తరాఖండ్ లో 2, బీహార్ లో 5, తెలంగాణలో 2, హర్యానాలో రెండు, మధ్యప్రదేశ్లో మూడు, ఒడిశాలో3 స్థానాలు ఉన్నాయి. తెలంగాణ నుంచి లక్ష్మీకాంత రావు, ధర్మపురి శ్రీనివాస్.. జూన్లో రిటైర్ కానున్నారు. ఆ ఇద్దరి స్థానాలకు జూన్ 10న ఎన్నికలు ఉంటాయి.