Madhya Pradesh | న్యూఢిల్లీ: ఎన్నికల రాజకీయాలు కుటుంబాల్లో చిచ్చు రేపుతున్నాయి. మధ్యప్రదేశ్లోని బాలాఘాట్ లోక్సభ నియోజకవర్గంలో భార్యాభర్తల మధ్య సైద్ధాంతిక విభేదాలు ఈ స్థాయికి చేరుకున్నాయి. బాలాఘాట్ ఎమ్మెల్యే అనుభ ముంజరే కాంగ్రెస్ నేత. ఆమె భర్త కంకర్ ముంజరే లోక్సభ ఎన్నికల్లో బాలాఘాట్ నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అనుభ మాట్లాడుతూ పోలింగ్ పూర్త య్యే వరకు దూరంగా ఉండాలని తన భర్త తనకు చెప్పారని తెలిపారు.
కంకర్ మాట్లాడుతూ, తామిద్దరమూ ఒకే ఇంట్లో ఉంటే, ఈ ఎన్నికల్లో తాము మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నామని ప్రజలు భావిస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అనుభ స్పం దిస్తూ, గత ఏడాది జరిగిన శాసనసభ ఎన్నికల్లోనూ తామిద్దరం పోటీ చేశా మని..అప్పట్లో ఒకే ఇంట్లో ఉన్నామని, ఇప్పుడు మాత్రమే ఆయన వేర్వేరుగా ఉందామని చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉందని వాపోయారు.