న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రథమార్ధంలో జరగనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ఇవాళ మధ్యాహ్నం 3.30 నిమిషాలకు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించనున్నది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. సీఈసీ సుశీల్ చంద్ర నేతృత్వంలో ఓ బృందం ఇటీవల యూపీలో పర్యటించింది. అయితే రాజకీయ పార్టీలన్నీ షెడ్యూల్ ప్రకారం అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు ఆయన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఒకవైపు కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తారా లేక ఆలస్యం చేస్తారా అన్న సందేహాలు వ్యక్తం అయ్యాయి. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగానే ఉన్న సందర్భంగా షెడ్యూల్ ప్రకారమే ఎన్నికల నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.