El Nino | ప్రపంచ వాతావరణ సంస్థ ఎల్నినోకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది ఎల్నినో కారణంగా వేడి పెరుగుతోందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. 2023-24లో నమోదైన ఐదు అత్యంత ఘోరమైన విపత్తుల్లో ఎల్నినో ఒకటిగా నిలువనుందని చెప్పింది. ఎల్నినో ప్రభావంతో మార్చి నుంచి మే వరకు దాదాపు అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ప్రపంచ వాతావరణ సంస్థ అంచనా వేసింది. రాబోయే నెలల్లో ప్రపంచ వాతావరణంపై ఎల్ నినో ప్రభావం కొనసాగుతుందని పేర్కొంది. ఎల్నినో ప్రభావంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో అధిక ఉష్ణోగ్రతలు, విపరీతమైన వాతావరణ పరిస్థితులు నమోదవుతున్నాయని చెప్పింది. అయితే, 2023 సంవత్సరం ఇప్పటి వరకు అత్యంత వేడి సంవత్సరంగా నిలిచింది. జూన్ 2023 నుంచి ప్రతి నెలవారీ ఉష్ణోగ్రత రికార్డు అయినట్లు డబ్ల్యూఎంఓ సెక్రటరీ జనరల్ సెలెస్టే సౌలో పేర్కొన్నారు. 2023 సంవత్సరమే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా నిలువగా.. నిరంతరం పెరుగుతున్న ఈ ఉష్ణోగ్రతకు ఎల్నినో మార్చి నుంచి మే వరకు కొనసాగే అవకాశం దాదాపు 60శాతం ఉందని డబ్ల్యూఎంవో పేర్కొంది.
ఏప్రిల్ నుంచి జూన్ వరకు తటస్థ పరిస్థితులు 80శాతం అవకాశం ఉంది. గ్లోబల్ ఆర్గనైజేషన్ సంవత్సరం చివరిలో లా నినా పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని.. అయితే అందులో ఇంకా అనిశ్చితి ఉందన్నారు. భారత్ విషయానికి వస్తే.. జూన్ నుంచి ఆగస్ట్ వరకు లా నినా పరిస్థితులు ఏర్పడడం వల్ల ఈ ఏడాది భారత్లో రుతుపవనాల సమయంలో గతేడాది కంటే వర్షాలు గతేడాది కంటే మెరుగ్గా కురుస్తాయని డబ్ల్యూఎం పేర్కొంది. భూమధ్యరేఖ పసిఫిక్లోని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎల్నినో పరిస్థితులను స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని.. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు గత 10 నెలలుగా స్థిరంగా.. అసాధారణంగా ఎక్కువగా ఉన్నాయని ఆయన అన్నారు. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు జనవరి 2024లో అత్యధికంగా నమోదయ్యాయి. ఎల్నినో పరిస్థితులు వచ్చే ఏడాది నైరుతి రుతుపవనాలపై ప్రభావం చూపబోవని గతంలో భారత వాతావరణ శాఖ గత నవంబర్లో పేర్కొంది. తీవ్రమైన ఎల్ నియో మధ్య, ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాల సీజన్లో భారతదేశం సగటు వర్షపాతాన్ని నమోదు చేసింది.
ఎల్ నినో అనేది సదరన్ ఆసిలేషన్ (ENSO)లో భాగం. ఇది వాతావరణం, మహాసముద్రాలకు సంబంధించిన సహజ వాతావరణ దృగ్విషయం. సదరన్ ఆసిలేషన్ రెండు దశలను కలిగి ఉంది. అవే ఎల్ నినో, లా నినా. పసిఫిక్ మహాసముద్రంలో పెరూ సమీపంలో సముద్ర తీరం వేడెక్కే దృగ్విషయాన్ని ఎల్ నినో అంటారు. సాధారణ భాషలో అర్థం చేసుకుంటే.. సముద్ర ఉష్ణోగ్రత.. వాతావరణ పరిస్థితులలో మార్పులకు కారణమయ్యే సముద్ర దృగ్విషయానికి ఎల్ నినోగా పిలుస్తారు. మార్పు కారణంగా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత సాధారణం కంటే 4-5 డిగ్రీలు ఎక్కువగా ఉంటుంది.
ఎల్ నినో సమయంలో ఆగ్నేయాసియా, ఆస్ట్రేలియా, మధ్య ఆఫ్రికా ప్రదేశాల్లో పొడి వాతావరణం ఏర్పడుతుంది. ఈ సమయంలో భారత్లో రుతుపవనాలను బలహీనంగా మారుతుంది. ఎల్ నినో గత 70 సంవత్సరాలలో 15 సార్లు సంభవించింది. ఈ సమయంలో భారతదేశంలో సాధారణం.. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కేవలం ఆరు సార్లు మాత్రమే. గత నాలుగు ఎల్నినో సమయాల్లో భారతదేశం నిరంతర కరువు పరిస్థితులు, వర్షపాతంలో తీవ్రమైన లోటును ఎదుర్కొన్నది. 1997లో బలమైన ఎల్ నినో కారణంగా భారతదేశంలో 102 శాతం సాధారణ వర్షపాతం నమోదైంది.