ముంబై, జనవరి 6: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన రూ.11 కోట్లు విరాళం ప్రకటించింది. శివసేన పార్టీ నాయకులు శనివారం శ్రీరామ్మందిర్ తీర్థ క్షేత్ర ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ను కలుసుకొని విరాళం చెక్ను అందజేశారు.
శ్రీరాముడి విగ్రహం కోసం బంగారు పాదుకల్ని తయారుచేయించిన హైదరాబాద్కు చెందిన చల్లా శ్రీనివాస శాస్త్రి, తన పాదయాత్రలో అయోధ్యకు 272 కిలోమీటర్ల దూరంలోని చిత్రకూట్కు చేరుకున్నారు. మద్యప్రదేశ్కు చెందిన యువకుడు కార్తిక్ జోషి ఇండోర్ నుంచి అయోధ్యకు 1008 కిలోమీటర్లు మారథాన్ రన్ను చేపట్టారు. శుక్రవారం మొదలైన ఆయన మారథాన్ పరుగు 14 రోజుల తర్వాత అయోధ్యను చేరుకోనున్నది. నేపాల్లోని జనక్పురికి చెందిన భక్తులు సందేశ యాత్రలో వివిధ కానుకలను తెచ్చి అయోధ్య రామాలయానికి సమర్పించారు.