జైపూర్:జైపూర్: రాజస్థాన్లో ఘోర ప్రమాదం జరిగింది. కోటా (Kota) వద్ద కారు అదుపుతప్పి నదిలో పడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న తొమ్మిదిమంది సజీవ సమాధి అయ్యారు. తొమ్మిది మంది ఓ కారులో ఉజ్జయినీలో జరుగుతున్న వివాహ వేడుకకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కోట వద్ద చంబల్ నది (Chambal river) దాటుతుండగా అదుపుతప్పి అందులో పడిపోయింది. దీంతో అందులో ఉన్న తొమ్మిది మంది మృతిచెందారు.
Rajasthan | Eight people died after their car fell off Chhoti Puliya and into the Chambal river in Kota. The occupants of the car were going to a wedding. The car was retrieved with the help of a crane. pic.twitter.com/TYjWlioP2q
— ANI (@ANI) February 20, 2022
సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ సహాయంతో కారును నదిలో నుంచి బయటకు తీశారు. మృతదేహాలను దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.