న్యూఢిల్లీ: పత్రికా స్వేచ్ఛ విషయంలో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న అణచివేత ధోరణులు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధమని ‘ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా చోటుచేసుకున్న ఉదంతాలను పేర్కొంటూ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్కు లేఖ రాసింది.
హిందీ యూట్యూబ్ న్యూస్ చానల్ ‘బోల్తా హిందుస్తాన్’ను నిలిపివేయటంపై గిల్డ్ ఆందోళన వ్యక్తం చేసింది. కనీసం వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వలేదని పేర్కొన్నది.