న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సోమవారం సమన్లు జారీ చేసింది. నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ నెల 21న విచారణకు హాజరుకావాలని కోరింది. అయితే, ఈ కేసులో ఈడీ ఎదుట హాజరయ్యేందుకు కొద్దిరోజుల గడువు కోరిన విషయం విధితమే. కరోనా బారినపడి కోలుకున్న సోనియా గాంధీని విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ మేరకు కొద్ది రోజుల పాటు ఈడీ ఎదుట హాజరుకాలేదనని చెప్పగా.. ఇందుకు ఈడీ సైతం అంగీకరించింది. ఇదే కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని దర్యాప్తు సంస్థ 50 గంటల పాటు ప్రశ్నించింది.