ED Summons | మనీలాండరింగ్ కేసులో సీనియర్ బీజేడీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రఫుల్లా సమల్తో పాటు తనయుడికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) సమన్లు జారీ చేసింది. బరపడ ఇంజినీరింగ్ కాలేజీ భూ అక్రమాలకు సంబంధించిన కేసులో సమల్తో పాటు ఆయన తనయుడు ప్రయస్కాంతికి సమన్లు పంపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అన్ని పత్రాలతో ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో తండ్రీకొడుకులను ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఫోర్జరీ, మోసం కేసులో ఈ నెల 15న ఒడిశాలోని భద్రక్, భువనేశ్వర్ నగరాల్లోని పది ప్రదేశాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. బరపడ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (BSET) సొసైటీకి చెందిన ప్రయస్కాంతి సమల్ (మాజీ అధ్యక్షుడు), మనోజ్ కుమార్ గోస్వామి (కార్యదర్శి)తో పాటు పలువురిని అరెస్టు చేసింది. తనిఖీల్లో వివిధ పత్రాలతో పాటు డిజిటల్ పరికరాలు, రూ.9లక్షల నగదు, తేదీ లేని చెక్కులు, ల్యాండ్ అగ్రిమెంట్, రూ.40లక్షల విలువైన టాయోటా ఫార్చ్యూనర్ కారును ఈడీ స్వాధీనం చేసుకున్నది.