న్యూఢిల్లీ/రాంఛీ, మార్చి 3: హవాలా కేసులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) అధికారులు హజారీబాగ్ జిల్లాలో శుక్రవారం జార్ఖండ్కు చెందిన ఐఏఎస్ అధికారిణి పూజా సింఘాల్, ఇతరులపై దాడులు జరిపారు. వారి ఇండ్ల నుంచి రూ.3 కోట్ల నగదు సీజ్ చేశారు. మహ్మద్ అన్సారీ అనే వ్యక్తి నుంచి పెద్ద మొత్తంలో 500, 2 వేల రూపాయల నోట్ల కట్టలను స్వాధీనం చేసుకొన్నట్టు అధికారులు తెలిపారు.
జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలకు సంబంధించి మనీలాండరింగ్ ఆరోపణలపై 2000 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి అయిన పూజా సింఘాల్ నిరుడు మే 11న అరెస్ట్ అయ్యారు. అనారోగ్యంతో ఉన్న తన కూతురును చూసుకొనేందుకుగాను ఆమెకు ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కాగా, మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద దాఖలు చేసిన రెండో కేసులో భాగంగా రాష్ట్రంలో మైనింగ్ రంగంలో అక్రమాలకు సంబంధించి ఆమె పాత్రను ఈడీ ప్రస్తుతం విచారిస్తున్నది.