న్యూఢిల్లీ, అక్టోబర్ 10: కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే ఎంపీ ఏ రాజాకు చెందిన రూ.55 కోట్ల విలువైన ‘బినామీ’ ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ వెల్లడించింది. ఇందులో 15 స్థిరాస్తులు ఉన్నాయని తెలిపింది. మనీల్యాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఈ ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొంది.