న్యూఢిల్లీ, మార్చి 4: కాంగ్రెస్ ముఖ్య నేత సల్మాన్ ఖుర్షిద్ భార్య లూయిస్ ఖుర్షిద్.. కేంద్ర ప్రభుత్వ నిధుల్ని కాజేశారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. కేంద్ర నిధులు రూ.71.50 లక్షలను లూయిస్ ఖుర్షిద్, మరో ఇద్దరు అక్రమంగా దారిమళ్లించి, మనీలాండరింగ్కు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఈడీ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కేసులో మనీలాండరింగ్ చట్టం (పీఎంఎల్ఏ) కింద ఉత్తరప్రదేశ్లోని ఫరూఖాబాద్ జిల్లాలో 15 వ్యవసాయ భూముల్ని, డాక్టర్ జాకిర్ హుస్సేన్ మెమోరియల్ ట్రస్ట్కు చెందిన రూ.45.92 లక్షల బ్యాంక్ డిపాజిట్లను అటాచ్ చేసినట్టు ఈడీ పేర్కొన్నది.