న్యూఢిల్లీ, మే 24: ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఆప్ ఎంపీ సంజయ్సింగ్ సహచరుల ఇండ్లపై ఈడీ బుధవారం ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. మద్యం కేసు చార్జ్షీట్లో రాజీవ్ సింగ్ బదులు ఆప్ ఎంపీ సంజయ్సింగ్ పేరు పొరపాటుగా పడిందని ఈడీ గత నెల కోర్టుకు తెలిపిన నేపథ్యంలో మళ్లీ దాడులకు దిగటం చర్చనీయాంశమైంది.
మోదీ సర్కార్ నియంతృత్వానికి, గూండాయిజానికి పాల్పడుతున్నదని సంజ య్ సింగ్ విమర్శించారు. తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేకున్నా.. ఈడీ ఎలా దాడులకు దిగుతుందని ప్రశ్నించారు. సంజయ్సింగ్ సన్నిహితులుగా భావిస్తున్న సర్వేశ్ మిశ్రా, అజిత్ త్యాగీ నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు జరిగినట్టు తెలిసింది.