రాయ్పూర్/న్యూఢిల్లీ: ఛత్తీస్గఢ్ బొగ్గు స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతల నివాసాలతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.
రాయ్పూర్లో ఈ నెల 24 నుంచి 26 మధ్య కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో ఈ దాడులు జరుగడం గమనార్హం. ఎమ్మెల్యే దేవేందర్ యాదవ్, పీసీసీ ట్రెజరర్ రామ్గోపాల్ అగర్వాల్, అధికార ప్రతినిధి ఆర్పీ సింగ్, తదితర నేతల ఇండ్లలో ఈడీ తనిఖీలు నిర్వహించింది. బొగ్గు స్కామ్లో లబ్ధి పొందినట్టు భావిస్తున్న వారిని విచారిస్తున్నట్టు అధికారులు తెలిపారు. కాగా, పార్టీ నేతల ఇండ్లలో ఈడీ సోదాలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది.