Punjab | చండీగఢ్, మార్చి 27: ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేసిన తర్వాత ఈడీ ఇప్పుడు పంజాబ్పై దృష్టి సారించినట్టు కనిపిస్తున్నది. జామతోటల నష్టపరిహారానికి సంబంధించిన కేసులో బుధవారం ఈడీ అధికారులు చండీగఢ్, మొహాలీ, పాటియాలా, ఫిరోజ్పూర్, బతిండ ప్రాంతాల్లోని పలువురు అధికారులు, ప్రైవేటు వ్యక్తుల ఇండ్లలో సోదాలు నిర్వహించారు. పంజాబ్ ఎక్సైజ్ కమిషనర్ వరుణ్ రూజమ్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. జామతోటల నష్టపరిహారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వరుణ్ రూజమ్ భార్య సిమ్రత్ప్రీత్ కౌర్ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఫిరోజ్పూర్ డిప్యూటీ కమిషనర్ రాజేశ్ ధిమమ్ ఇంట్లోనూ ఈడీ బృందాలు సోదాలు జరిపాయి. రాజేశ్ భార్య జాస్మీన్ కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా ఆదివారం ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఆప్ సన్నద్ధం అవుతున్న వేళ ఈడీ పంజాబ్లో రంగంలోకి దిగడం గమనార్హం.