ED Raids | భారత్ పేపర్స్ లిమిటెడ్ (BPL)కి చెందిన రూ.200కోట్ల బ్యాంకు రుణాల మోసం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) బుధవారం జమ్మూ కశ్మీర్, పంజాబ్, ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. ఈ విషయాన్ని ఈడీ వర్గాలు వెల్లడించాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియంతో డైరెక్టర్లు సుమారు రూ.200 కోట్ల మోసాలకు పాల్పడ్డారని కంపెనీపై ఆరోపణలున్నాయి. ఇతర బ్యాంకుల్లో జమ్మూ అండ్ కశ్మీర్ (J&K) బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), కరూర్ వైశ్యా బ్యాంక్ ఉన్నాయి. సెప్టెంబర్ 2006లో స్థాపించిన భారత్ పేపర్స్ లిమిటెడ్ జమ్మూ, లూథియానాలో ఉన్న పేపర్ బోర్డ్ ప్యాకేజింగ్ పరిశ్రమ అయిన భారత్ బాక్స్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (BBFFIL)కి అనుబంధంగా ఉన్నది.