న్యూఢిల్లీ: స్వతంత్ర డిజిటల్ వార్తా సంస్థ న్యూస్క్లిక్, దాని వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థపై ఈడీ తీసుకొన్న చర్యలను ఢిల్లీ హైకోర్ట్ గత నెల 29న కొట్టివేసింది. స్వేచ్ఛాయుత, నిష్పాక్షిక పాత్రికేయాన్ని లక్ష్యంగా చేసుకొని విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కేసును ఈడీ అల్లిందని చెప్తూ ఆ సంస్థపై మనీ లాండరింగ్ కేసును కొట్టివేసింది. ఈడీ అనుసరించిన చర్యను కోర్టు ’అన్వేషణాత్మక గాలింపు చర్య’గా అభివర్ణించింది. ‘ఏ విధమైన నేరం లేనప్పటికీ పిటిషనర్ల ఆర్థిక వ్యవహారాల్లో దర్యాప్తు జరిగిన తీరు.. వాటి గురించి గాలించడానికి అటూ ఇటు తిరగడం లాంటిదేనని స్పష్టంగా తెలుస్తున్నది’ అని కోర్టు తెలిపింది.
ఏడాదిన్నరపాటు దర్యాప్తు చేసినా నేరం జరిగిందని గుర్తించడం లేదా రికార్డ్ చేయడం జరగలేదని కోర్ట్ వెల్లడించింది. ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ఎఫ్ఐఆర్ను కూడా కోర్ట్ కొట్టివేస్తూ.. దాన్ని కొనసాగనివ్వడం చట్టపరమైన పక్రియను తీవ్రంగా దుర్వినియోగం చేయడమేనని పేర్కొన్నది. ఉనికిలో లేని ఒక యూఎస్ సంస్థ నుంచి న్యూస్క్లిక్కు 2018లో నిధులు వచ్చాయని ఈడీ ఆరోపించి కేసు నమోదు చేసింది.