11 గంటలు పాటు కొనసాగిన విచారణ
నేడూ హాజరవ్వాలని సూచన
న్యూఢిల్లీ, జూన్ 14: నేషనల్ హెరాల్డ్ మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీని ఈడీ రెండోరోజు 11 గంటల పాటు ప్రశ్నించింది. సెంట్రల్ ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఉదయం 11.30 గంటలకు చేరుకున్న రాహుల్ను మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఈడీ ప్రశ్నించింది. అనంతరం సాయంత్రం 4.30 గంటల నుంచి రెండో సెషన్ను కొనసాగించింది.
బుధవారం కూడా విచారణకు హాజరుకావాలని అధికారులు రాహుల్కు సూచించారు. కాగా, ఈడీ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్ పలు చోట్ల నిరసనలకు దిగింది. నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ పార్టీ సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, అధిర్ రంజన్ చౌదరి తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.