న్యూఢిల్లీ : ఈడీ అభ్యంతరాల నడుమ ఢిల్లీ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1 వరకూ పొడిగించింది. ఈడీ దర్యాప్తు సాగిస్తున్న మనీల్యాండరింగ్ కేసులో జైన్కు సర్వోన్నత న్యాయస్ధానం నుంచి ఊరట లభించింది. జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ ఎంఎం సుందరేష్తో కూడిన సుప్రీం బెంచ్ జైన్కు ఆరోగ్య కారణాలపై బెయిల్ను పొడిగించింది.
మనీల్యాండరింగ్ కేసులో జైన్ను ఈడీ 2022 మేలో అరెస్ట్ చేసింది. సత్యేందర్ జైన్కు వెన్నుపూస ఆపరేషన్ జరగడంతో ఆయన కోలుకునేందుకు చికిత్స తీసుకుంటున్నారని జైన్ తరపు న్యాయవాది ఏఎం సింఘ్వి కోర్టుకు తెలిపారు. అయితే మధ్యంతర బెయిల్ పొడిగింపును అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎస్వీ రాజు వ్యతిరేకిస్తూ జైన్ చూపుతున్న వైద్య సలహా ఇందుకు అర్హమైనది కాదని వాదించారు.
జైన్ను లొంగిపోవాలని కోరాలని, ఆయనను సాధారణ ఖైదీలానే పరిగణించాలని, మెడికల్ బెయిల్ కేసును పరిగణనలోకి తీసుకోరాదని కోరారు. జైన్ దరఖాస్తును ఎయిమ్స్ పరిశీలించేలా కోరాలని కోర్టుకు నివేదించారు. జైన్ జైలులో స్విమ్మింగ్ పూల్ కావాలని కోరుకుంటున్నారని, దీన్ని అందరూ భరించలేరని, ఆయన ఫిజియోథెరఫీలో ఇది భాగమైతే తాము ఆయనను స్విమ్మింగ్ పూల్కు తీసుకువెళతామని ఏఎస్జీ పేర్కొన్నారు.
Read More :
Woman Met On Flight | విమానంలో పరిచయమైన మహిళ.. గోవా హోటల్లో లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తి