న్యూఢిల్లీ, నవంబర్ 2: జార్ఖండ్లో కీలక పరిణామం చోటుచేసుకొన్నది. అక్రమ మైనింగ్ ఆరోపణలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం సమన్లు జారీచేసింది. రాంచీలోని తమ ప్రాంతీయ కార్యాలయానికి గురువారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని కోరింది.
మనీలాండరింగ్ నియంత్రణ చట్టం(పీఎంఎల్ఏ) కింద సొరేన్ను ప్రశ్నిస్తామని, ఆయన స్టేట్మెంట్ను రికార్డు చేస్తామని ఈడీ అధికారులు వెల్లడించారు. ఈ కేసులో ఈడీ ఇప్పటికే సొరేన్ రాజకీయ ప్రతినిధి పంకజ్ మిశ్రాతో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసింది. ఈ ఏడాది జూన్ 8న రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పంకజ్ మిశ్రా, అతని సన్నిహితుల ఇండ్లలో సోదాలు జరిపింది.