డెహ్రాడూన్, మార్చి 27: ఉత్తరాఖండ్ మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత హరక్ సింగ్ రావత్కు ఈడీ తాజాగా మరోసారి నోటీసులు జారీ చేసింది. మనీ లాండరింగ్ కేసులో ఏప్రిల్ 2న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ ఫిబ్రవరి 7న హరక్ సింగ్ ప్రాంగణాలపై దాడి చేసి 1.2 కోట్ల నగదు, బంగారం, ముఖ్యమైన పత్రాలను స్వాధీనం చేసుకుంది.
ఫిబ్రవరి 29న తమ ముందు హాజరు కావాలని నోటీసులు పంపినప్పటికీ, వేరే పని ఉన్నందున దానిని వాయిదా వేయాలంటూ ఆయన కోరారు. దీంతో ఈడీ తాజాగా మరోసారి నోటీసులు పంపింది.