న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ ఎనిమిదోసారి సమన్లు జారీచేసింది. మార్చి 4న తమ ఎదుట విచారణకు రావాలని కోరింది.
ఈ కేసులో ఈడీ ఇప్పటికే ఏడుసార్లు సమన్లు జారీచేసినప్పటికీ కేజ్రీవాల్ హాజరుకాలేదు. విషయం కోర్టు పరిధిలో ఉన్నందున, ఈడీ పదేపదే సమన్లు జారీచేయడం తగదని, కోర్టు ఆదేశిస్తే తాను విచారణకు హాజరవుతానని కేజ్రీవాల్ స్పష్టంచేశారు.