కోల్కతా, మార్చి 25: పశువుల అక్రమ రవాణా కేసులో పశ్చిమబెంగాల్ మంత్రి చంద్రనాథ్ సిన్హాకు ఈడీ సోమవారం సమన్లు జారీ చేసింది. ఈ నెల 22న నిర్వహించిన సోదాల్లో ఆయన నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లోని సమాచారం ఆధారంగా ఈ సమన్లు జారీ చేశారు.
మంత్రి ఫోన్లోని కొన్ని కీలక పత్రాలను పరిశీలించినట్టు ఈడీ తెలిపింది. స్మగ్లింగ్ కేసులో ఇప్పటికే అరస్టై జైల్లో ఉన్న టీఎంసీ నేత అనుబ్రతా మండల్తో సిన్హాకు సాన్నిహిత్యం ఉందని ఈడీ తెలిపింది. ఇటీవల సిన్హా ఇంట్లో చేసిన సోదాల్లో లభించిన రూ.41 లక్షల నగదు గురించి ఎన్నికల సంఘానికి, ఆదాయ పన్ను విభాగానికి సమాచారం ఇచ్చినట్టు చెప్పింది. నగదుకు సంబంధించి సిన్హా సంతృప్తికరమైన సమాధానాలను ఇవ్వలేదని వివరించింది. అయితే దీనిపై స్పందించడానికి సిన్హా నిరాకరించారు.