న్యూఢిల్లీ, అక్టోబర్ 30: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ సోమవారం సమన్లు జారీ చేసింది. నవంబర్ 2న విచారణకు రావాలని కోరింది. ఇదే కేసులో రిమాండ్లో ఉన్న ఆప్ నేత మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించిన కొద్ది గంటల్లోనే ఈడీ ఈ సమన్లు జారీ చేయడం గమనార్హం.
ఈ కేసులో రూ.338 కోట్ల లావాదేవీలకు సంబంధించి తదుపరి నిర్ధారణ జరగాల్సి ఉందన్న కారణంతో సిసోడియాకు బెయిల్ నిరాకరించినట్టు సుప్రీంకోర్టు తెలిపింది.