న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ శనివారం ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్పై ఢిల్లీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ కేసులో సంజయ్ సింగ్ను ఈడీ ఈ ఏడాది అక్టోబర్లో అరెస్టు చేసింది. మద్యం పాలసీ కేసులో నిందితుడిగా ఉన్న వ్యాపారవేత్త దినేశ్ అరోరా రెండు విడతలుగా సంజయ్ సింగ్కు ఆయన నివాసంలో రూ.2 కోట్లు ఇచ్చారనేది ఈడీ ఆరోపణ. అయితే ఈ ఆరోపణలు ఎంపీ సంజయ్ సింగ్ కొట్టిపారేశారు.