న్యూఢిల్లీ, మార్చి 29: దేశంలోని అవినీతికి ప్రధాని మోదీయే కారణమంటూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. అవినీతిపరులందరినీ ఒకే పార్టీలోకి తెచ్చిన ఘనత కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలకే దక్కుతుందన్నారు. ఎప్పుడైతే బీజేపీ పాలన అంతమవుతుందో అప్పుడు దేశం అవినీతి రహితం అవుతుందని పేర్కొన్నారు.
ఢిల్లీ అసెంబ్లీలో బుధవారం ఆయన విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా సభలో మాట్లాడుతూ దేశంలో ప్రజాస్యామ్య అణచివేతకు దొరికే ఏ అవకాశాన్నీ బీజేపీ వదులుకోదని విమర్శించారు. ‘దొంగలు, అవినీతిపరులు, లూటీకోరులు ఒకే పార్టీలో ఉన్నారు. అయితే వారి పాలన ముగిసి ఆ పార్టీ నేతలంతా జైలుకు వెళ్లిన తర్వాత అవినితి రహిత దేశంగా భారత్ మారుతుంది’ అంటూ బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సీబీఐ, ఈడీలతో తమ ఎమ్మెల్యేలపై దాడులు చేసినా వారు లొంగలేదని పేర్కొన్నారు.