న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ఫౌండేషన్కు చెందిన రూ.36 కోట్ల స్థిరాస్తుల్ని, బ్యాంక్ ఖాతాలోని రూ.34.7 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని శనివారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రకటించింది.
తమిళనాడులోని ఫౌండేషన్కు రూ.36.3 కోట్ల ఆస్తులు, రూ.34.5 లక్షల నగదు ఎలా వచ్చాయన్నది వివరించటంలో ఫౌండేషన్ ట్రస్టీలు విఫలమయ్యారని ఈడీ అధికారులు చెప్పారు.