రాయ్పూర్: ఛత్తీస్గఢ్ అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐఏఎస్ అధికారిని ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. సీఎం భూపేష్ భగేల్కు అత్యంత సన్నిహితుడైన ఐఏఎస్ ఆఫీసర్ సమీర్ విష్ణోయ్తోపాటు వ్యాపారవేత్తలు సునీల్ అగర్వాల్, లక్ష్మీకాంత్ తివారిని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఐఏఎస్ అధికారి సమీర్ నివాసాల్లో ఈడీ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు.
కాగా, రాష్ట్ర ప్రభుత్వంలో అత్యున్నత పదువుల్లో ఉన్న ప్రభుత్వ అధికారుల ఆస్తులపై ఈడీ అధికారులు అక్టోబర్ 11న దాడులు నిర్వహించారు. రాయ్పూర్, రాయ్గఢ్, మహాకముంద్, కోర్బా, ఇతర జిల్లాల్లోని ప్రభుత్వానికి సంబంధించిన సుమారు 40 ప్రదేశాల్లో తనిఖీలు చేశారు.