Manipur | న్యూఢిల్లీ, మార్చి 16: ఏడు విడతల్లో నిర్వహించే లోక్సభ స్థానాలను మొత్తం లెక్కిస్తే 544 సీట్లు వస్తున్నాయి. దేశంలో ఉన్నది 543 లోక్సభ స్థానాలే అయితే 544 స్థానాలకు షెడ్యూల్ ఎందుకు ప్రకటించారనే ప్రశ్న తలెత్తింది. దీనికి సీఈసీ రాజీవ్ కుమార్ వివరణ ఇచ్చారు.
ఔటర్ మణిపూర్ స్థానానికి రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఇటీవల జరిగిన మణిపూర్ అల్లర్ల కారణంగా ఇండ్లు వదిలేసి వేరే ప్రాంతాల్లో తాత్కాలికంగా నివసిస్తున్నారు. వీరు ఓట్లు వేసేందుకు వీలుగా ఏప్రిల్ 19న, ఏప్రిల్ 26న రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్టు రాజీవ్ కుమార్ తెలిపారు.