న్యూఢిల్లీ: సాధ్యమైనంత త్వరితంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్)కు సంబంధించిన సన్నాహక పనులను పూర్తి చేయాలని 22 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఆదేశించింది. తదుపరి దశ సర్ ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఈ కార్యక్రమం పూర్తయితే అన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో సర్ ప్రక్రియ పూర్తయినట్లే. తెలంగాణ, ఏపీ సహా వివిధ రాష్ర్టాలు, యూటీలు సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు ఎన్నికల కమిషన్ తెలిపింది.