Earthquake | మేఘాలయ, లఢక్లో ఆదివారం మధ్యాహ్నం భూకంపం సంభవించింది. మేఘాలలో రిక్టర్ స్కేల్పై 3.5 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. మేఘాలయలోని ఈస్ట్ గారో హిల్స్ నగరంలో భూకంప కేంద్రం గుర్తించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. ఆదివారం మధ్యాహ్నం 2.37 గంటలకు భూప్రకంపనలు వచ్చినట్లు తెలిపారు.
ఒక్కసారిగా ప్రకంపనలు రావడంతో జనం ఆందోళనకు గురై ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. స్వల్ప ప్రకంపనలతో ఎలాంటి జరుగం జరుగలేదని అధికారులు తెలిపారు. అలాగే, కేంద్ర పాలిత పాంత్రమైన లఢక్లోని కార్గిల్లో సైతం భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 2.42 గంటల సమయంలో రిక్టర్ స్కేల్పై 3.8 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది. కార్గిల్లో భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు తెలిపింది.