న్యూఢిల్లీ: లడఖ్లోని కార్గిల్లో 5.5 తీవ్రతతో భూకంపం (Earthquake) సంభవించింది. దీంతో ఉత్తర భారతదేశంతోపాటు పాకిస్థాన్లో కూడా ప్రకంపనలు వచ్చాయి. సోమవారం మధ్యాహ్నం 3.48 గంటలకు ఈ భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సీఎస్) తెలిపింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.5 గా నమోదైనట్లు పేర్కొంది. లడఖ్లోని కార్గిల్ కేంద్రంగా భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభించినట్లు వివరించింది. దీని ప్రభావం వల్ల ఉత్తర భారత్లోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. అలాగే పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ సహా ఆ దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రకంపనలు కనిపించినట్లు పేర్కొంది. సోమవారం తెల్లవారుజామున పాకిస్థాన్లో 4.0 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు వెల్లడించింది. అయితే ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం సంబంధించి ఎలాంటి వివరాలు తెలియలేదు.