చంఫై: మిజోరంలోని చంఫైలో (Champhai) స్వల్పంగా భూమి కంపించింది. బుధవారం తెల్లవారుజామున 12.50 గంటలకు చంఫైకి సమీపంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.4గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. చంఫైకి 50 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 13 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని పేర్కొన్నది.
Earthquake of Magnitude:4.0, Occurred on 07-09-2022, 00:50:55 IST, Lat: 23.41 & Long: 93.82, Depth: 13 Km ,Location: 50km E of Champhai, Mizoram, India for more information Download the BhooKamp App https://t.co/skraIhJw3D pic.twitter.com/jQ86j84Kt7
— National Center for Seismology (@NCS_Earthquake) September 6, 2022
పొరుగుదేశం చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసింది. దీంతో 65 మంది మృతిచెందారు. వందలమంది తీవ్రంగా గాయపడగా.. వేలాది మంది నిర్వాసితులుగా మారారు. చాలా ప్రాంతాల్లో భవనాలు దెబ్బతినగా, భారీ వృక్షాలు కూలిపోయాయి.