శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని కత్రాలో (Katra) భూకంపం వచ్చింది. గురువారం ఉదయం 7.52 గంటలకు కత్రాలో భూమి కంపించింది. దీనితీవ్రత 3.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. కత్రాకు 62 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూఅంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో భూ కలదలికలు సంభవించాయని పేర్కొన్నది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించింది.
Earthquake of Magnitude:3.5, Occurred on 08-09-2022, 07:52:56 IST, Lat: 33.14 & Long: 75.58, Depth: 10 Km ,Location: 62km ENE of Katra, Jammu and Kashmir, India for more information download the BhooKamp App https://t.co/Ehs7xM6Y7D @Indiametdept @ndmaindia pic.twitter.com/W8NE36mN49
— National Center for Seismology (@NCS_Earthquake) September 8, 2022
బుధవారం తెల్లవారుజామున 12.50 గంటలకు మిజోరంలోని చంఫైలో స్వల్పంగా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.4గా నమోదయింది. చంఫైకి 50 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని ఎన్సీఎస్ తెలిపింది.