న్యూఢిల్లీ: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ (Manipur) మరోసారి భూకంపంతో వణికిపోయింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో భూమి కంపించింది. రాత్రి 11.43 గంటల సమయంలో మణిపూర్లోని తౌబుల్లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీనితీవ్రత 3.3గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. భూఅంతర్భాగంలో 40 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని తెలిపింది. అర్ధరాత్రి వేళ భూకంపం రావడంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు పెట్టారు. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు.
Earthquake of Magnitude:3.3, Occurred on 23-10-2022, 23:41:34 IST, Lat: 24.66 & Long: 93.97, Depth: 40 Km ,Location: Thoubal, Manipur, India for more information Download the BhooKamp App https://t.co/ly1Uzc8jUB pic.twitter.com/50GKzjE47N
— National Center for Seismology (@NCS_Earthquake) October 23, 2022
వెరీ హైరిస్క్ జోన్లో ఉన్న మణిపూర్లో శుక్రవారం కూడా భూకంపం వచ్చింది. దీనితీవ్రత 4.4గా నమోదయిందని ఎన్సీఎస్ వెల్లడించింది. అయితే ఆస్తి, ప్రాణ నష్టం వంటివి సంభవించలేదని తెలిపింది.