డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో స్వల్ప భూకంపం వచ్చింది. శనివారం ఉదయం 5.03 గంటలకు ఉత్తరకాశీలో (Uttarkashi) భూమి కంపించింది. దీని తీవ్రత 4.1గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS) తెలిపింది. ఉత్తరకాశీకి 39 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు.
కాగా, వారం రోజుల వ్యవధిలో ఉత్తరకాశీలో భూకంపం రావడం ఇది మూడోసారి. గత ఆదివారం ఉదయం 11.27 గంటలకు 4.1 తీవ్రతో భూమి కంపించింది. అంతకుముందు రోజు (ఫిబ్రవరి 5న) కూడా 3.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. ఈనెల 10న జమ్ముకశ్మీర్ సహా ఢిల్లీ ఎన్సీఆర్, ఉత్తరాఖండ్లో 5.7 తీవ్రతతో భూ ప్రకంపణలు చోటుచేసుకున్నాయి.