Earthquake Delhi | దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం సాయంత్రం శక్తిమంతమైన భూకంపం సంభవించింది. ఢిల్లీ-ఎన్సీఆర్ రీజియన్తోపాటు ఉత్తర భారత ప్రాంతాల్లోనూ భూమి ప్రకంపించింది. హిందూకుష్ రీజియన్ పరిధిలోని ఆఫ్ఘనిస్థాన్లో మంగళవారం సాయంత్రం భూకంపం సంభవించింది. ఆ వెంటనే రెండు నిమిషాల్లోనే ఢిల్లీతోపాటు పలు ఉత్తర భారత రాష్ట్రాల్లో భారీగా భూ ప్రకంపనలువచ్చాయి. ఆఫ్ఘనిస్థాన్లో భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.5గా నమోదైంది. ఆఫ్ఘన్లో మంగళవారం వరుసగా రెండు సార్లు భూకంపం వచ్చింది. ఆఫ్ఘనిస్థాన్లోని ఫయాజాబాద్కు ఆగ్నేయ దిశగా 133 కి.మీ. దూరంలో భూకంప కేంద్రం ఉందని తెలుస్తున్నది.
పాకిస్థాన్లోని పలు నగరాల్లో భూమి కంపించింది. భూమి కంపించడంతో పలువురు తమ ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపిస్తున్న వీడియోల దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తుర్కెమినిస్థాన్, కజకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, చైనా, కిర్గిస్థాన్ దేశాల్లోనూ భూకంపం సంభవించింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ప్రాణనష్టం జరిగినట్లు తెలియరాలేదు.