న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్లో స్వల్పంగా భూమి కంపించింది. లడఖ్లోని లేహ్లో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.30 గంటలకు భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.8గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. అర్ధరాత్రి వేళ భూమి కంపించడం వల్ల ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన సమాచారం ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.
పొరుగు దేశమైన మయన్మార్లో కూడా భూమి కంపించింది. గురువారం అర్ధరాత్రి 11.58 గంటలకు మయన్మార్లోని మోన్యవా ప్రాంతంలో భూ కంపం వచ్చింది. దీని తీవ్రత 5.5గా నమోదయిందని ఎన్సీఎస్ తెలిపింది.