న్యూఢిల్లీ : కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్లోని కార్గిల్ను భూకంపం వణికించింది. సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 4.3 తీవ్రతో ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. కార్గిల్కు 64 కిలోమీటర్ల దూరంలో, భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు పేర్కొంది. అయితే, భూకంపం కారణంగా ఎలాంటి నష్టం జరిగినట్లుగా నివేదికలు అందలేదని అధికారులు పేర్కొన్నారు. రెండు రోజుల కిందట లేహ్లో భూకంపం సంభవించింది. గత నెలలో జమ్మూ ప్రాంతంలోని దోడా, రియాసి, కిష్త్వార్, ఉధంపూర్ జిల్లాల్లో 13సార్లు భూకంపాలు నమోదయ్యాయి.